పేరు (ఆంగ్లం) | Nandini Sidda Reddy |
పేరు (తెలుగు) | నందిని సిద్ధారెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | రత్నమాల |
తండ్రి పేరు | నర్రా బాలసిధారెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | మల్లీశ్వరి |
పుట్టినతేదీ | 06/12/1955 |
మరణం | – |
పుట్టిన ఊరు | మెదక్ జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ అధ్యాపకుడు రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://www.sakshi.com/news/vedika/nandini-siddareddy-favorite-five-books-492651 |
స్వీయ రచనలు | భూమిస్వప్నం సంభాషణ ఆధునిక తెలుగుకవిత్వం – వాస్తవికత – అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం) దివిటీ ప్రాణహిత ఒక బాధ కాదు నది పుట్టుబడి ఇగురం ఆవర్థనం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.telugubooks.in/collections/all/nandini-siddhareddy |
పొందిన బిరుదులు / అవార్డులు | 1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు 1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి అవార్డు 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం 2009లో ఒక బాధకాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం 2010లో ‘నాగేటి సాలల్లో నా తెలంగాణా’ పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం 2016లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించాడు. నందిని సిధారెడ్డి తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. బందారం, వెల్కటూరు, సిద్ధిపేట లలో చదువు ముగించుకుని హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నాడు. |
నందిని సిద్ధారెడ్డి
మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించాడు. నందిని సిధారెడ్డి తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. బందారం, వెల్కటూరు, సిద్ధిపేట లలో చదువు ముగించుకుని హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నాడు.
మెదక్లో కొంతకాలం పనిచేసి తరువాత సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాడు. విద్యార్థి దశనుండే కథలు, కవిత్వం వ్రాశాడు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపాడు. గులాబి అనే చిన్నపత్రికను ప్రకటించాడు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ‘మంజీర’ బులెటిన్కు సంపాదకత్వం వహించి ఏడు కవితాసంకలనాలను వెలువరించాడు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం – ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే “నాగేటి చాల్లల్ల” కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి తెలంగాణ సంస్కృతి మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను “పోరు తెలంగాణ” సినిమాలో పాటగా తీసుకున్నారు.4 ఈ పాటకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ, గోరటి వెంకన్న రచించిన “గానమా తెలంగాణమా” కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.
మే 2, 2017లో ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీ కి తొలి చైర్మన్గా నియామకం అయ్యాడు .
———–