Share
పేరు (ఆంగ్లం)N.Gopi
పేరు (తెలుగు)ఎన్. గోపి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుఎన్.అరుణ
పుట్టినతేదీ6/25/1950
మరణం
పుట్టిన ఊరుయాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి
విద్యార్హతలు
వృత్తిఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి పూర్వపు అధ్యక్షుడు మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపసంచాలకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను040-27037585 9391028496
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతంగేడుపూలు (1976),మైలురాయి (1982),చిత్రదీపాలు (1989),వంతెన (1993),
కాలాన్ని నిద్రపోనివ్వను (1998),చుట్టకుదురు (2000),ఎండపొడ (2002)
,జలగీతం (2002) – దీర్ఘకావ్యం,నానీలు (2002),మరో ఆకాశం (2004),అక్షరాల్లో దగ్ధమై (2005),మళ్ళీ విత్తనంలోకి (2014)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుతంగెడు పూలు కవితా సంపుటికి 1980లో కృష్ణశాస్త్రి అవార్డు
మైలురాయి కవితాసంపుటికి 1982లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
మైలురాయికి తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
చిత్రదీపాలు కవితాసంపుటికి సినారె కవితాపురస్కారం
చిత్రదీపాలు కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమకవితాసంపుటి బహుమతి (1990)
2006 సంవత్సరానికి సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజన్ అవార్డ్
దాశరథి సాహితీ పురస్కారం (2017) – తెలంగాణ ప్రభుత్వం[5]
ఇతర వివరాలుఆచార్య ఎన్.గోపి తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగాను పనిచేశాడు. నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకాలాన్ని నిద్రపోనివ్వను
సంగ్రహ నమూనా రచనపోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి సాహిత్య అకాడెమీ అవార్డ్ అనే “మైలు రాయి” దాటింది. ఆయన అలోచనల్నే కాదు కాలాన్ని కూడా నిద్ర పోనివ్వనని ప్రతిజ్ఞ చేసి రాసినట్టున్నారు ఈ పుస్తకం.

 కాలాన్ని నిద్రపోనివ్వను

పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి సాహిత్య అకాడెమీ అవార్డ్ అనే “మైలు రాయి” దాటింది. ఆయన అలోచనల్నే కాదు కాలాన్ని కూడా నిద్ర పోనివ్వనని ప్రతిజ్ఞ చేసి రాసినట్టున్నారు ఈ పుస్తకం.

మనలో చాలామంది అనుకునేలానే చచ్చిపోతున్న ఉత్తరం గురించి అక్కడ ఇలా ఉంది.

“ఫోన్లలో ఏముంది హృదయ నిశ్శబ్ధం తప్ప

నిన్నూ నన్నూ ఉద్వేగ రేఖపై నిలిపిన ఈ ముత్యాల వంతెనను ఎవరు కూల్చేశారు ప్రియా”

ఆసక్తి రెట్టింపవగా స్థిమితంగా చదవటం మొదలెట్టాను.

జీవితంలో ఎదగాలని అందరికీ ఉంటుంది కానీ “నిచ్చెనలో ఏ మెట్టూ సుఖంగా ఉండదు” అని మరోసారి గుర్తు చేశారు.

ఎన్నాళ్ళో కలిసి ఉంటుంటాం కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నామా?

“మనుషుల మధ్య ప్రవహించే ఎడారుల గురించే బాధ”

కవిత్వం నిజంగా అంతా విస్తృతమా అనిపించేలా

“పద్యాల్లో పట్టనంత పెద్ద ప్రపంచం ఉంటుందా

జీవితం ఇరుకైనప్పుడు మైదానాల్ని మరింత విశాలం చేసేదే కవిత్వం” అని భరోసా ఇచ్చి,

“నీ అహం నా సహనం పై బరువును మోపుతుంది” అని పాత విషయమే ఐనా సరికొత్త సమీకరణంలో చెప్పారు.

“కన్నీళ్ళు బాల్యం వైపు పరిగెడతాయి

ఎండుటాకులకు కూడా పచ్చని జ్ఞాపకాలుంటాయి”

చిన్ననాటి రోజులు గుర్తొస్తే మనందరికీ ఇలాగే అనిపిస్తుంది కదూ..

మూర్తీభవించిన ఏకాంతాన్ని కదిలించటం ఎలా?

“గాలిని ముక్కలుగా కోసే గడ్డిపోచలు ఘనీభవించిన ఏకాంతాన్ని కరిగిస్తాయి”

వెన్నెల ఏ కవిని మాత్రం ఆకర్షించలేదు?

“చంద్రుడ్ని ఎన్ని సార్లు రుద్దినా అరిగిపోడు వెన్నెల గంధం వస్తూనే ఉంటుంది” అని ఈయన చంద్రుణ్ణి గంధపు చెక్కగా మార్చేశారు.

అత్యద్భుతమైన క్షణాల్లో మాటలు మాత్రం ఒక్కోసారి మెదలకుంటాయి.. భావావేశం ఏదైనా కానీ..

“అపూర్వ సంగమాలు అనివార్య వియోగాలు ఏవీ తిరిగి చేతికందవు

చచ్చుబడి పోయిన మాటల్ని గురించే బాధ”

విషాదాల్లోకెల్లా విషాదం ఆప్తుల మరణం. అది కూడ ఈయన కవితకి అనుభవం.

“తనకి తెలియదు. తన మరణం క్షణమైతే మా మరణం క్షణక్షణమని”.

“వర్షమంటే నాకు మేఘాల తాళపత్రాలపై లిఖిస్తున్న మహా గ్రంధంలా ఉంటుంది”

ఇంకోచోట వర్షం గురించి ఇలా గంభీరం గా అనేసి,

ఇదంతా ఎందుకు రాస్తున్నారంటే “కలతగా ఉంది, కవిత్వం సోకినట్టుంది” అని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు.

———–

You may also like...