పేరు (ఆంగ్లం) | Anumula Venkata Subrahmarsi Sastri |
పేరు (తెలుగు) | అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | అచ్చమాంబ |
తండ్రి పేరు | వేంకటనారాయణ |
జీవిత భాగస్వామి పేరు | వేంకట సుబ్బమ్మ |
పుట్టినతేదీ | 3/2/1905 |
మరణం | ఏప్రిల్ 5, 1959 |
పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా పెదగోగులపల్లి |
విద్యార్హతలు | – |
వృత్తి | అధ్యాపకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పరశురామ చరిత్రము పరశురామ చరిత్రము (విమర్శ) రామ నివాసము పాల్కురికి సోమనాథకవి ప్రియదర్శిక మంగళ గౌరి శమంతకమణి శంకర జీవితము ఉషాపరిణయము కర్నూలు మండల చరిత్ర |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు కవి, బహుగ్రంథకర్త. భార్గవ రామ చరిత్రం అనే మహాకావ్యంతో పాటుగా శ్రీ భర్తృహరి నిర్వేదము, కావ్యగుచ్ఛము, విద్వద్దంపతీ విలాసము మొదలైన కావ్యాలెన్నో రాశారు. మహాకావ్యమైన భార్గవ రామ చరిత్రం గ్రంథాన్ని మహాభారతం ఉద్యోగ పర్వంలో 5 శ్లోకాల్లో క్లుప్తంగా – ప్రజాకంటకులైన హైహయులు, వారిని అనుసరించిన క్షత్రియులను నిర్జించేందుకు బ్రాహ్మణులు, ఇతర వర్ణాల వారు ప్రత్నించి భంగపడడం. నాయకత్వేలేమిని నివారించేందుకు ఓ నీతిశాస్త్ర, శస్త్రాస్త్ర విశారదుడైన బ్రాహ్మణ వీరుని నేతృత్వంలో సర్వక్షత్రియులను జయించడం కనిపిస్తుంది. ఆ విషయాన్నే విస్తరించి మహాకావ్యాన్ని సుబ్రహ్మణ్యశాస్త్రి నిర్మించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
ముద్రిత గ్రంథాలు
ఆయన ముద్రిత కావ్యాల్లో భార్గవ రామ చరిత్ర అనే మహాకావ్యం కూడా ఉంది. హైహయులు, వారి అనుయాయులైన క్షత్రియులు ప్రజలను పీడించడంతో బ్రాహ్మణులు మొదలైన ఇతర మూడు వర్ణాల వారు ఒక్కటై వారితో పలుమార్లు పోరాడి ఓడిపోయారనీ, తమ ఓటమికి నాయకత్వలేమి కారణమని గ్రహించి నీతిశాస్త్ర విశారదుడు, శూరుడు అయిన బ్రాహ్మణ వీరుడిని (పరశురాముడు) సైన్యాధిపత్యానికి ఒప్పించి, సర్వ క్షత్రియులను జయించినట్టు మహాభారత ఉద్యోగపర్వంలోని సైన్య నిర్యాణ పర్వంలో 5 శ్లోకాల్లో సంగ్రహంగా ఉంది. దీన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఇతర పురాణాల్లో ఉన్న పరశురామ గాథలను సమన్వయం చేసుకుంటూ ఈ మహాకావ్యాన్ని నిర్మించారు సుబ్రహ్మణ్యశాస్త్రి.
హరిహరోపాధ్యాయుడు సంస్కృతంలో రాసిన వేదాంత ప్రధానమైన గ్రంథాన్ని శ్రీ భర్తృహరి నిర్వేదము పేరిట ప్రబంధాన్ని రచించారు. మూలంలోని భావాన్ని వదలక, తనదైన ప్రత్యేక కావ్యంగా దీన్ని ఆయన తీర్చిదిద్దారు. ఈ కావ్యంలో భర్తృహరి తన భార్య భానుమతీదేవి మౌనముద్రకు కారణం తెలియక ఆమెను అనునయించే ఘట్టాన్ని పారిజాతాపహరణంలోని సత్యభామ అలక ఘట్టానికి సాటివచ్చేలా రచించే ప్రయత్నం చేశారు. సుభాషిత త్రిశతి రచించిన భర్తృహరిజీవితంలో అందుకు పాదులు వేసిన ఘట్టాలను, ఆయన వేదాంతి కావడం వంటివి ఈ కావ్యవస్తువు.
కావ్యగుచ్ఛము అనే మరో గ్రంథంలో తారాచంద్రుల ఇతివృత్తం, అష్టావక్రుని బ్రహ్మచార దీక్షకు పరీక్షాఘట్టం వంటి పలు ఇతివృత్తాలతో నిర్మించిన చిరు కావ్యాలు గుదిగుచ్చారు. విద్వద్దంపతీ విలాసము అనే మరో కావ్యంలో విదుషీమణి ఐన కాపుకులస్త్రీ, బ్రాహ్మణుడు ప్రేమించి ఫలించక మరణిస్తారు, తర్వాత ఈజిప్ట్ దేశంలో మళ్ళీ పుట్టి ప్రేమ ఫలింపజేసుకుంటారు. ఈజిప్టులో వారిద్దరి కలయికకు ఇతివృత్తాన్ని ప్రఖ్యాత అరేబియన్ నైట్స్ లోని ఒక కథను తీసుకుని దాని అనుసృజనగా చేశారు. కాకతీయుల నాటి ఇతివృత్తంతో కుమార రుద్రదేవకవి, బమ్మెర పోతన, పౌరాణికాంశాలతో భారతీయ స్త్రీ ధర్మాలు, శ్రీకృష్ణ చరిత్ర రాశారు. ఇవన్నీ వివిధ సంస్థలు ముద్రించినవి.
సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన మహాకావ్యమైన భార్గవ రామచరిత్ర సహా ఏ రచనలూ జీవించివుండగా ప్రచురణకు నోచుకోలేదు. జీవించినంతకాలం ఇవి ముద్రితాలు కావాలని, పదుగురూ తన రచనలు చదవాలనీ కోరుకున్నారు. ఆయన మరణించాకా పలు సంస్థలు, వ్యక్తుల చొరవతో ఒక్కొక్కటిగా ఈ రచనలు ప్రచురితమయ్యాయి.
అముద్రిత గ్రంథాలు
అముద్రితమైన ఆయన రచనల్లో ఈ కిందివి ఉన్నాయి
- పరశురామ చరిత్రము
- పరశురామ చరిత్రము (విమర్శ)
- రామ నివాసము
- పాల్కురికి సోమనాథకవి
- ప్రియదర్శిక
- మంగళ గౌరి
- శమంతకమణి
- శంకర జీవితము
- ఉషాపరిణయము
- కర్నూలు మండల చరిత్ర
———–