పేరు (ఆంగ్లం) | Kalidasu purushotam |
పేరు (తెలుగు) | కాళిదాసు పురుషోత్తం |
కలం పేరు | – |
తల్లిపేరు | రమణమ్మ |
తండ్రి పేరు | కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1942 మే 1 |
మరణం | – |
పుట్టిన ఊరు | నెల్లూరు |
విద్యార్హతలు | ఎం.ఏ |
వృత్తి | కళాశాల ప్రిన్సిపాల్ |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కనక పుష్యరాగం – పొణకా కనకమ్మ స్వీయచరిత్ర (సంపాదకత్వం) సునయన క్రియేషన్స్, శ్రీ యం,వి.రాయుడు, బెంగుళూరు, 2011 ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (జీవితచరిత్ర, కృషి. -పరిశోధన)సొసైటీ ఫర్ సోషల్ చేంజ్,నెల్లూరు,2007 వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం(ఉస్మానియా విశ్వవిద్యాలం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన గ్రంథం-1971-ప్రథమ ముద్రణ2014) కవిత్రయ కవితా వైజయంతి (పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి సంపాదకత్వం)నెల్లూరు వర్ధమాన సమాజం ప్రచురణ,1974.) కావ్యపంచమి (సంపాదకత్వం దుర్భా సుబ్రమణ్య శర్మగారి రచనలు.)1975 ప్రచురణ. శివారెడ్డి పద్యాలు (పెన్నేపల్లి గోపాలకృష్ణ, బండి నాగారాజు, బ్రహ్మారెడ్డి లతో కలిసి సంపాదకత్వం)1980 అలనాటి సాహిత్య విమర్శ (.సంపాదకులు: కాళిదాసు పురుషోత్తం, Dr M. శివరామప్రసాద్), ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం, హైదరాబాద్.2008. గురుజాడలు (సంపాదకులు: పెన్నేపల్లి గోపాలకృష్ణ, కాళిదాసు పురుషోత్తం, యం.వి.రాయుడు. మనసు ఫౌండేషన్ , బెంగుళూరు2012. గోపినాథుని వెంకయ్యశాస్త్రి జీవితం, సాహిత్యం,TTD ఆర్ధికసహకారం తో ప్రచురణ.1988. పెన్న ముచ్చట్లు, (నెల్లూరు మండల చరిత్ర, సంస్కృతి మీద వ్యాసాలు) పల్లవి పబ్లికేషన్స్ , విజయవాడ, 2018. తెలుగు సంస్కృతి, రెండవ సంపుటం (కొన్ని వ్యాసాలు), తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.1988. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | గురజాడ అప్పారావు స్వర్ణపతక పురస్కారం |
ఇతర వివరాలు | నెల్లురు వర్ధమాన సమాజ కార్యవర్గ సభ్యులు గా కవిత్రయ కవితా వైజయంతి, ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాల ప్రచురణలో సహకరించాడు. భారతి, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి, జమీన్ రయితు, యూత్ కాంగ్రెస్, తదితర పత్రికల్లో సాహిత్యం, సినిమా, travelogues రాసాడు. పూనే ఫిల్మ్ & టి.వి. ఇన్స్టిట్యూట్ లో 5వారాలు ఫిల్మ్ appreciation కోర్సు చేసాడు.(1976)కావలి జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. పట్టాభిరామిరెడ్డి గారికి సహకరించి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సభలు(A.P.History Congress) స్తాపించడంలో సహకారం అందించాడు. ఈ సంస్థ స్థాపక సభ్యుదు కూడా. 1986 నుండి Indian History Congress సభలకు హాజరువుతూ, పరిశోధన పత్రాలు సమర్పించాడు. ఫోటోగ్రఫీ, చరిత్ర, సినిమా, పర్యటన, గుఅజాడ అప్పారావు గారి రాత ప్రతులు (manuscripts) పరిశోధించడం తన హాబిఇలు. కందుకూరు వీరేషలింగం పంతులు సమకాలికులు, పీపుల్స్ ఫ్రండ్ ఆంగ్ల వారపత్రికా సంపాదకులు దంపురు నరసయ్య గారి జీవితం, క్రుషి మీద పరిశోధించి “ఇంగ్లిష్ జర్నలిజంలొ తొలి తెలుగువెలుగు దంపురు నరసయ్య” పుస్తం రచించాడు. పెన్నేపల్లి గొపాలక్రిష్ణతో కలిసి గురజాడ ప్పారావు పంతులు పత్రాలు పరిశీలించి, గురజాడ సమగ్రరచనల సంకలనం వెలువరించాడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కనకపుష్యరాగం |
సంగ్రహ నమూనా రచన | కొన్నాళ్ళక్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథను పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు తక్కువ అన్నాను. వారం తిరక్కుండానే ఇంకో ఇద్దరు మహిళల ఆత్మకథలు పుస్తకాలుగా వచ్చాయని తెలిసింది. అప్పుడే శిలాలోలిత గారు తమ బ్లాగులో పొణకా కనకమ్మగారి స్వీయచరిత్రను పరిచయం చేశారు. ఆ పుస్తకం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో దొరికింది. సంపన్న, సంప్రదాయ కుటుంబంలో ఆ కాలంలో పుట్టి పెరిగిన కనకమ్మగారు రచయిత్రిగా, స్వాతంత్ర్యపోరాటయోధురాలిగా, మహిళావిద్యావేత్తగా తన జీవితాన్ని గడపిన క్రమం చాలా ఆశ్చర్యకరం. |
కాళిదాసు పురుషోత్తం
కొన్నాళ్ళక్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథను పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు తక్కువ అన్నాను. వారం తిరక్కుండానే ఇంకో ఇద్దరు మహిళల ఆత్మకథలు పుస్తకాలుగా వచ్చాయని తెలిసింది. అప్పుడే శిలాలోలిత గారు తమ బ్లాగులో పొణకా కనకమ్మగారి స్వీయచరిత్రను పరిచయం చేశారు. ఆ పుస్తకం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో దొరికింది. సంపన్న, సంప్రదాయ కుటుంబంలో ఆ కాలంలో పుట్టి పెరిగిన కనకమ్మగారు రచయిత్రిగా, స్వాతంత్ర్యపోరాటయోధురాలిగా, మహిళావిద్యావేత్తగా తన జీవితాన్ని గడపిన క్రమం చాలా ఆశ్చర్యకరం.
“తెలుగునాట ఆడవాళ్ళు స్వీయచరిత్ర వ్రాసుకోవడము ఎక్కడైనా ఉండవచ్చును కానీ, అంతగా లేదు. ఆ భాగ్యము నాకు లభించినందుకు గర్వపడుచున్నాను.స్త్రీలకు సమర్థత లేక కాదుకానీ వారు బయట సంచరిటము తక్కువ” అంటూ తన స్వీయచరిత్రను కనకమ్మగారు 1959 జనవరి15న మొదలుబెట్టి 1960 సెప్టెంబరు 20న ముగించినా, ఏ కారణాలచేతో కాని, 2011 వరకూ అముద్రితంగానే ఉండిపోయింది. నెల్లూరులో విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు పనిగట్టుకొని ఈ వ్రాతప్రతిని సంపాదించి, సంస్కరించి, కనకమ్మగారి గురించి ఇతర విషయాలను సేకరించి శ్రద్ధగా ప్రచురించారు.
కనకమ్మగారు 1892 జూన్ 10వతేదీన నెల్లూరుజిల్లా మినగల్లులో పుట్టారు. మడమనూరులో, పోట్లపూడిలో పెరిగారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి, అమ్మ కామమ్మ. తాతలు కోడెల వ్యాపారులు. పడమటి బేరగాండ్రు ఇల్లంతా కంబళ్ళు పరచి వాటి మీద వెండిరూపాయలు కుప్పలు కుప్పలుగా పోసుకొని లెక్కపెట్టుకునేవారట. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డిగారితో ఆమెకు తొమ్మిదవ ఏట వివాహమయ్యింది. పోట్లపూడిలోనే కాపురం. జిల్లాలోని పెద్ద కుటుంబాలలో ఒకటి. 800 ఎకరాల పొలం; 500 ఆవులుండేవట. కోడెదూడల మీద సంవత్సరానికి పదివేలరూపాయల ఆదాయం, 20,30 వేల రూపాయల ధాన్యం రాబడి. వారి అవ్వ మరణించినప్పుడు పదిపుట్ల అన్నప్రదానము చేశారట; వచ్చినవారికి “త్రాగటానికి నీరుపోసే అవకాశము లేక వీధులలో కాలువలు త్రవ్వి నీరు పారించినారు”. అన్నప్రదానము చేయుటలో సుబ్బరామిరెడ్డిగారికి పెట్టింది పేరు.
కనకమ్మ గారు చిన్నతనంలో చదువుకోలేదు. తర్వాత స్వయంకృషి వల్ల చదువుకున్నారు. క్రమంగా కావ్యాలు, సంస్కృతము, హిందీ నేర్చుకున్నారు. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ పత్రికలకు పద్యాలు, వ్యాసాలు పంపేవారు, చెట్టునీడ ముచ్చట్లు పేర ఆమె హిందూసుందరిలో వ్రాసిన వ్యాసాలకు మంచి గుర్తింపు వచ్చింది.
పోట్లపూడిలో కనకమ్మగారు సోదరులు, మరదులు, నెల్లూరు రామానాయుడు (తర్వాత జమీన్రైతు పత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు), మరికొందరితో కలసి 1913లో సుజనరంజనీ సమాజం స్థాపించి గ్రంథాలయము, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటివారు సమాజ కార్యక్రమాలకు వచ్చేవారు. నెమ్మదిగా సమాజంలోకి రాజకీయ భావాలు వచ్చాయి. మద్రాసునుంచి రివాల్వరులు తెప్పించి వాటిని పేల్చడం ప్రాక్టీసు కూడా చేశారు. వెన్నెలకంటి రాఘవయ్యగారు పూనాలో తిలక్నీ, మద్రాసులో చిదంబరం పిళ్ళేని కలసివచ్చారు. స్వదేశీ వస్త్రాలు ధరించటం, హరిజనవాడల్లో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుబెట్టారు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభలో ఆంధ్రరాష్ట్ర తీర్మానం చేశారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో జాతీయోద్యమంలో కనకమ్మగారి పాత్ర పెరగటం మొదలయ్యింది. పెద్దపెద్ద నాయకులందరూ వారి ఇంటనే బస చేసేవారు. గాంధీజీ, బిపిన్చంద్రపాల్, రాజేంద్రప్రసాద్, ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు వంటి జాతీయ, రాష్ట్రీయ నాయకులు వారి ఆతిథ్యం స్వీకరించిన వారే. గోగినేని రంగా, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయి దేశముఖ్ వంటివారు సన్నిహితంగా ఉండేవారు.
ఈ కార్యక్రమాలలో నెమ్మదిగా ఆస్తులు తరగటం ప్రారంభమయింది. వెంకటగిరి రాజాతో ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కుటుంబం జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో భాగంగానే జమీన్రైతు పత్రిక ఆవిర్భవించింది. ఇతరులు కూడా మోసం చేశారు. నివాసం పోట్లపూడినుంచి, పిడూరుకూ, అక్కడి ఆస్థీ పోయాక నెల్లూరుకూ మారింది. మోసం చేసినవారిగురించి, తర్వాత రోజుల్లో ఇబ్బందులు పెట్టిన వారి గురించి అవసరమైనదానికన్నా తక్కువ పరుషంగా మాట్లాడారు ఈ ఆత్మకథలోలో. ఆత్మస్థుతీ, పరనిందా రెండూ తక్కువే. పిడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లంతా కాలిపోయి భారీనష్టం జరిగింది. పుస్తకాల బీరువా (కొన్ని అముద్రిత పుస్తకాలతో సహా) కాలిపోయింది. ఇల్లు పోయినదానికన్నా పుస్తకాల బీరువా పోయినందుకు ఎక్కువ బాధపడ్డాను అని అన్నారు కనకమ్మ గారు.
కనకమ్మగారు నెల్లూరు స్త్రీల కాంగ్రెస్ సంస్థను స్థాపించి స్వాతంత్ర్యపోరాటంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళారు. గాంధీజీ వచ్చినప్పుడు ఆమె, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ తమ వంటిపై నగలన్నీ కాంగ్రెస్ నిధికి ఇచ్చారు. 1934లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్కు ఉపాధ్యక్షులుగా ఎన్నికయిన మొదటి మహిళ కనకమ్మ గారు.
———–