గుత్తి రామకృష్ణ (Guthi Ramakrishna)

Share
పేరు (ఆంగ్లం)Guthi Ramakrishna
పేరు (తెలుగు)గుత్తి రామకృష్ణ
కలం పేరు
తల్లిపేరునారాయణమ్మ
తండ్రి పేరుగుత్తి వెంకటప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీఎం.ఏ
మరణం5/12/2009
పుట్టిన ఊరుఅనంతపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
విద్యార్హతలుఎస్.ఎల్.సి
వృత్తిపాత్రికేయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగంజి కోసరం
చిరంజీవి
శిల్పి
వడ్లగింజలో
జొన్నచేను
కూటికోసం.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుగుత్తి రామకృష్ణ రాయలసీమ కథకుడు, పాత్రికేయుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాకులలో ఒకడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగొప్పవ్యక్తి గుత్తి రామకృష్ణ
సంగ్రహ నమూనా రచన– రవామపక్ష పోరాటాలకే ఆయనే స్ఫూర్తి రశతజయంతి సభలో వక్తలు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

గుత్తి రామకృష్ణ

– రవామపక్ష పోరాటాలకే ఆయనే స్ఫూర్తి రశతజయంతి సభలో వక్తలు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

                 కమ్యూనిస్టు నాయకునిగా, విలేకరిగా, సాహిత్యవేత్తగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తుదిశ్వాస వరకు కృషి చేసిన గొప్పవ్యక్తి గుత్తి రామకృష్ణ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనా గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుకలను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతియాజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పాటూరి రామయ్య ప్రధానవక్తగా హాజరయ్యారు. శతజయంతి సందర్భంగా ‘అనంత ఆణిముత్యం’ పేరుతో గుత్తి రామకృష్ణ రచనలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ ఆవిష్కరించారు. అనంతరం పాటూరి రామయ్య మాట్లాడుతూ గుత్తిరామకృష్ణ స్వాతంత్య్ర సమరయోధులుగానూ, జర్నలిస్టుగానూ, అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రాయలసీమ ప్రాంత తొలి కథా రచయితగానూ గుత్తిరామకృష్ణ ప్రసిద్ధికెక్కారని చెప్పారు. జర్నలిస్టుగా ఉంటూ పీడిత, బడుగు బలహీన వర్గాల పక్షాన నిజాలను వెలుగులోకి తెచ్చే విధంగా తన కలాన్ని నాట్యం చేయించారని అభివర్ణించారు. ఇలాంటి నాయకులు నేటి తరం వారికి ఆదర్శప్రాయులన్నారు. అప్పట్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేదని అందుకే రామక్రిష్ణ లాంటి వారు ధైర్యంగా అన్యాయాన్ని వెలుగులోకి తేగలిగారన్నారు. రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ పూర్వపు కమ్యూనిస్టులను మరచిపోతున్న రోజుల్లో మరోసారి గుర్తు చేసుకునేలా సీనియర్‌ కమ్యూనిస్టు నేత గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుకలను సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయం అన్నారు. నేటి వామపక్ష పార్టీల పోరాటాలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అన్నారు. జిల్లాలో 1952-53 సంవత్సరంలో కరువు దుర్భిక్షం ఏర్పడినప్పుడు జిల్లా స్థితిపై గంజి కోసం అనే కథను రచించారన్నారు. వెట్టి చాకిరీపై చిరంజీవి, శిల్పి, వంటి కథలు రచించారన్నారు. గంజి కోసం అనే కథ చారిత్రకంగా, సామాజికంగా, సాహిత్యపరంగా విశిష్టతను సంపాదించిందన్నారు. ప్రాంతీయ జీవనాన్ని మాండలిక భాషలో కథలు రచించి ఆదర్శంగా నిలిచారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ గుత్తి రామక్రిష్ణ ప్రజల కోసం తుది శ్వాస వరకు పని చేశారన్నారు. భవిష్యత్‌ తరాల వారు పూర్వపు కమ్యూనిస్టులను గుర్తించి ఉద్యమ స్ఫూర్తి, సేవా భావాలను అలవర్చుకోవాలని గుర్తుచేస్తు శత జయంతి సభ నిర్వహించినట్లు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో స్మారక భవనాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐఎంఎల్‌ రాష్ట్ర నాయకులు పెద్దన్న, రచయితలు శాంతినారాయణ, ఏలూరి ఎంగన్న, యూటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు బెల్లంకొండ వెంకటసుబ్బయ్యలు గుత్తి రామకృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఆనంద్‌ వర్ధన్‌, రిటైర్డు డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, మానవ హక్కుల సంఘం ఎస్‌ఎం.బాషా తదితరులు పాల్గొన్నారు. 

 

సమరయోధులుగానూ, జర్నలిస్టుగానూ, అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రాయలసీమ ప్రాంత తొలి కథా రచయితగానూ గుత్తిరామకృష్ణ ప్రసిద్ధికెక్కారని చెప్పారు. జర్నలిస్టుగా ఉంటూ పీడిత, బడుగు బలహీన వర్గాల పక్షాన నిజాలను వెలుగులోకి తెచ్చే విధంగా తన కలాన్ని నాట్యం చేయించారని అభివర్ణించారు. ఇలాంటి నాయకులు నేటి తరం వారికి ఆదర్శప్రాయులన్నారు. అప్పట్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేదని అందుకే రామక్రిష్ణ లాంటి వారు ధైర్యంగా అన్యాయాన్ని వెలుగులోకి తేగలిగారన్నారు. రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ పూర్వపు కమ్యూనిస్టులను మరచిపోతున్న రోజుల్లో మరోసారి గుర్తు చేసుకునేలా సీనియర్‌ కమ్యూనిస్టు నేత గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుకలను సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయం అన్నారు. నేటి వామపక్ష పార్టీల పోరాటాలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అన్నారు. జిల్లాలో 1952-53 సంవత్సరంలో కరువు దుర్భిక్షం ఏర్పడినప్పుడు జిల్లా స్థితిపై గంజి కోసం అనే కథను రచించారన్నారు. వెట్టి చాకిరీపై చిరంజీవి, శిల్పి, వంటి కథలు రచించారన్నారు. గంజి కోసం అనే కథ చారిత్రకంగా, సామాజికంగా, సాహిత్యపరంగా విశిష్టతను సంపాదించిందన్నారు. ప్రాంతీయ జీవనాన్ని మాండలిక భాషలో కథలు రచించి ఆదర్శంగా నిలిచారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ గుత్తి రామక్రిష్ణ ప్రజల కోసం తుది శ్వాస వరకు పని చేశారన్నారు. భవిష్యత్‌ తరాల వారు పూర్వపు కమ్యూనిస్టులను గుర్తించి ఉద్యమ స్ఫూర్తి, సేవా భావాలను అలవర్చుకోవాలని గుర్తుచేస్తు శత జయంతి సభ నిర్వహించినట్లు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో స్మారక భవనాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐఎంఎల్‌ రాష్ట్ర నాయకులు పెద్దన్న, రచయితలు శాంతినారాయణ, ఏలూరి ఎంగన్న, యూటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు బెల్లంకొండ వెంకటసుబ్బయ్యలు గుత్తి రామకృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఆనంద్‌ వర్ధన్‌, రిటైర్డు డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, మానవ హక్కుల సంఘం ఎస్‌ఎం.బాషా తదితరులు పాల్గొన్నారు.

———–

You may also like...