అల్లాబక్షి బేగ్ షేక్‌ (Alla Bakshi Bagh Sheikh)

Share
పేరు (ఆంగ్లం)Alla Bakshi Bagh Sheikh
పేరు (తెలుగు)అల్లాబక్షి బేగ్ షేక్‌
కలం పేరుఆనంద బక్షి
తల్లిపేరుషేక్‌ మస్తాన్‌ బీ
తండ్రి పేరుఖాశిం బేగ్
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ9/12/1951
మరణం
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా బాపట్లలో
విద్యార్హతలుబి.ఏ.
వృత్తిజర్నలిస్ట్‌, నాటక రచయిత-నటుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతీరం చేరని కెరటాలు, ఛైర్మన్‌ చంద్రయ్య,కార్మికులారా ఏకంకండి, స్నేహదీపం, ఎవరు దేవుడు?
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువీరు ఉత్తమ రచయితగా, నటుడిగా పలు విజయాలను నమోదు చేసుకున్నారు. నటుడిగా, నాటక రచయితగా సాహితీ-సాంస్కృతిక సంస్థలచే సత్కరించ బడ్డాడు.
ఇతర వివరాలుప్రముఖ రంగస్థల రచయిత, నటుడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకార్మికులారా.. ఏకంకండి!
సంగ్రహ నమూనా రచన-హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
-అసంఘటిత కార్మికులను సంఘటితం చేయాలి
-సుప్రీంకోర్టు విరమణ న్యాయమూర్తి గోపాల గౌడ
-కొనసాగుతున్న ప్రపంచ గని కార్మికుల రెండో మహాసభలు

కార్మికులారా.. ఏకంకండి!

-అల్లాబక్షి బేగ్ షేక్‌

-హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
-అసంఘటిత కార్మికులను సంఘటితం చేయాలి
-సుప్రీంకోర్టు విరమణ న్యాయమూర్తి గోపాల గౌడ
-కొనసాగుతున్న ప్రపంచ గని కార్మికుల రెండో మహాసభలు

గోదావరిఖని, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులంతా హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి గోపాలగౌడ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ గని కార్మికుల మహాసభల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన ప్రతినిధుల మహాసభలో ఆయన పాల్గొని, ప్రారంభోపన్యాసం చేశారు. భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న వివిధ రకాల ఖనిజాలను వెలికితీయడానికి కృషి చేస్తున్న ప్రపంచ గని కార్మికులంతా ఇలా ఒకే వేదికపైకి రావడం శుభ పరిణామమన్నారు.

కార్మికవర్గం సుదీర్ఘ సమరశీల పోరాటాలతో సాధించుకున్న అనేక హక్కులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేడు అమలులో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. నేటి ప్రపంచీకరణ పరిస్థితులలో కార్మిక వర్గం అగ్రగామిపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు అనేక చట్టాలు అమలు చేశారనీ, ముఖ్యంగా గనుల రక్షణ చట్టంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.

బ్రిటిష్ కాలంలో దేశంలో మొదట 1910లో మైనింగ్ చట్టాన్ని తీసుకొచ్చారనీ, ఆ తర్వాత 1914లో, 1923, 1925, 1927, 1928, 1935, 1937, 1940, 1946ల్లో మార్పులు చేశారన్నారు. ఇవన్నీ కార్మికవర్గాన్ని ఇబ్బందుల పాలు చేసేలా ఉన్నాయని గోపాలగౌడ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానంతరం 1950లో భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత 1952లో వచ్చిన మైన్స్ యాక్టు కార్మికులకు కొంత మేర ప్రయోజనకంగా ఉందన్నారు.

అప్పటి నుంచి కొద్దో, గొప్పో కార్మికులకు ప్రయోజనం కలుగుతున్నా కార్మికులకు భద్రత, రక్షణ చర్యల అమలు, ఇతర అంశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. కాంట్రాక్టీకరణ పెరిగిపోవడం, పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోవడం శోచనీయమన్నారు. కోట్లాది మంది అసంఘటిత కార్మికవర్గాన్ని సంఘటితం చేయడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగాలని కోరారు.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కో-ఆర్డినేషన్ గ్రూప్ సభ్యులు, ఇప్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్ ప్రారంభోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడారు. మొదటి రోజు గురువారం ర్యాలీ, బహిరంగసభ అనంతరం మూడు రోజుల పాటు సభల నిర్వహణ విధి, విధానాలను తెలియజేశారు. ఇంటర్నేషనల్ కో-ఆర్డినేషన్ ముఖ్య సమన్వయకర్త అండ్రియాస్ మాట్లాడుతూ పెరూ దేశంలో జరిగిన మొదటి మహాసభ అనంతరం రెండో మహాసభ భారతదేశంలో జరుపుకోవడం, సభలకు తాను ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి ముందుకు సాగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ సభలో కజకిస్థాన్‌కు చెందిన అనటోలి ఇన్, కొలంబియాకు చెందిన అలెజన్‌డివో మువిటినెజెల్, కాంగోకు చెందిన ఇంజెన్ తాపియా, పెరూకు చెందిన పెవిడి అవెనస్, మహాసభల నిర్వహణ కమిటీ చైర్మన్ పీకే మూర్తితో పాటు టీ శ్రీనివాస్, చలపతిరావు, కే రాజన్న, ఈ నరేశ్, ఏ వెంకన్న, బీ సంపత్‌కుమార్, చిలుక శంకర్, తోకల రమేశ్, జే శ్రీనివాస్, ఎస్ వెంకటేశ్వర్‌రావు, కే విశ్వనాథ్, ఐ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

———–

You may also like...