గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు (Gannamraju Girija Manohar Babu)

Share
పేరు (ఆంగ్లం)Gannamraju Girija Manohar Babu
పేరు (తెలుగు)గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు
కలం పేరు
తల్లిపేరుశకుంతలమ్మ
తండ్రి పేరురామేశ్వర్ రావు
జీవిత భాగస్వామి పేరుగీత
పుట్టినతేదీ11/20/1951
మరణం
పుట్టిన ఊరుమహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో
విద్యార్హతలుఎం ఏ…బి.ఓ.ఎల్
వృత్తిజూనియర్ లెక్చరర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకొడాలి సుబ్బారావు-హంపీ క్షేత్రము, కళా పూర్ణోదయము-ఆధునిక రచనా దృక్పథము, తిలక్ రచనలు, దాశరథి పద్యం, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కావ్యాలు, గోపీనాథ రామాయణం, కాళోజీ,శతక కవుల సంగోష్ఠి, ప్రతాప రుద్ర సభ, కృష్ణా పత్రిక దర్బారు, వందే మాతరమ్, భువన విజయం, ఇంద్ర సభ, పుష్కర సభ, బ్రహ్మ సభ, గణపతి విజయం, గోలకొండ విజయం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువీరు పొందిన సత్కారాల్లో సాహితీ విరించి బిరుదు, తెలుగు భాషా దినోత్సవ పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం, స్వరసుధ వారి సత్కారం, కళావాహిని వారి సత్కారం, స్వర రవళి వారి సత్కారం, శాంతిదూత పురస్కారం, శాతవాహన విశ్వ విద్యాలయం వారి పురస్కారం ప్రముఖమైనవి.
ఇతర వివరాలుగన్నమరాజు గిరిజా మనోహర్ బాబు తెలంగాణకు చెందిన కవి మరియు రచయిత.ఆకాశవాణి, దూరదర్శన్ లోనే కాకుండా ఇతర చానళ్ళలో కూడా వివిధ ధార్మిక అంశాలతో పాటుగా, సాహిత్యోపన్యాసాలు కూడా చేస్తున్నారు.తిరుమల బ్రహ్మొత్సవాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలలో ఎన్నో పర్యాయాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

గన్నమరాజు గిరిజామనోహర బాబు కవిత : శిరసెత్తిన చైతన్యం

నేడు డా.దాశరథి 98వ జయంతి సందర్భంగా గన్నమరాజు గిరిజామనోహర బాబు రాసిన కవిత ” శిరసెత్తిన చైతన్యం ” ఇక్కడ చదవండి :
అవును , నిజం
చైతన్యం శిరసెత్తింది
ఉక్కుపాదాలకింద నలిగిపోతున్న
మనిషిని కాపాడింది చైతన్యం
సామాన్యునిలో శౌర్యం
మొలకెత్తించిందీ ఈ చైతన్యమే
బానిసగాబతకడం మాని
వీరుడై పోరాటపథం పట్టాలనీ
కత్తిపట్టి కర్తవ్యం నెరవేర్చాలనీ
అప్పుడు ఖచ్చితంగా విజయంనీదేననీ
నరనరానా శౌర్యం నింపిందీ
నిస్సందేహంగా ఈ చైతన్యమే
ప్రవహించే చైతన్యం
నేర్పింది పోరాటమొక్కటేనా ?
కాదు, అంతమాత్రమే కాదు
మండే గుండెల్లో మల్లెల గుబాళింపుల్నీ
పరిమళింపజేసింది
వసంతాల పచ్చదనాన్నీ
శృంగారపుటూహల్నీ నింపుకుంటూ
హృదయాన్ని సున్నితరీతిలో మధుమయం చేసింది
అగ్నిధారై కురిసిన ఈ చైతన్యమే
కవితాపుష్పకమై విహరించింది
రుద్రవీణగా మ్రోగిన ఈ చైతన్యమే
గాలిబ్ గీతాలై ప్రవహించింది
లోకానికి అమృతాభిషేకంచేసి
పునర్నవాన్ని కలిగించింది
తిమిరంతో ఘన సమరం జరిపి
బతుకుల్ని అమరం చెయ్యాలని తపన పడింది
ఆలోచనాలోచనాల్ని సారించి
సత్యాన్వేషణ చెయ్యాలని బోధించింది
నిస్తేజపు శిశిరాన్ని తప్పించి
నిత్య వసంతాన్నే నిలపాలని కోరింది
శిరసెత్తిన చైతన్యం
శిఖరమైవెలిగింది …
Last Updated Jul 22, 2022, 8:12 PM IST

 


గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు సాహితీ సేవలు
ప్రస్తుతం హనుమకొండ లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా, ప్రస్తుత ఉపాధ్యక్షునిగా గత పదహారేళ్ళుగా విస్తృతమైన సేవలనందిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండితులను ఆహ్వానించి మహాభారత దర్శనం పేరిట పద్ధెనమిది పర్వాల పై ప్రసంగాలు, భాగవత సుధా స్రవంతి పేర ద్వాదశ స్కంధాలపై ప్రసంగాలు, రామ కథా పరిమళం పేర కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత రామాయణ కల్పవృక్షం పై పది రోజుల ప్రసంగాలు రామాయణం -మానవ ధర్మము అనే అంశం పై చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు ముఖ్యమైనవి. శతాధిక సంఖ్యలో గ్రంథావిష్కరణ సభలు, సాహిత్య సమావేశాలు నిర్వహించడమే గాక జాతీయ స్థాయిలో జరిగిన అనేక సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. వీటిలో కొడాలి సుబ్బారావు-హంపీ క్షేత్రము, కళా పూర్ణోదయము-ఆధునిక రచనా దృక్పథము, తిలక్ రచనలు, దాశరథి పద్యం, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కావ్యాలు, గోపీనాథ రామాయణం, కాళోజీఆత్మకథ ముఖ్యమైనవి.
శతక కవుల సంగోష్ఠి, ప్రతాప రుద్ర సభ, కృష్ణా పత్రిక దర్బారు, వందే మాతరమ్, భువన విజయం, ఇంద్ర సభ, పుష్కర సభ, బ్రహ్మ సభ, గణపతి విజయం, గోలకొండ విజయం వంటి సాహిత్య రూపకాల్లో చారిత్రక కవుల పాత్రధారణ చేశారు.
ఆకాశవాణి, దూరదర్శన్ లోనే కాకుండా ఇతర చానళ్ళలో కూడా వివిధ ధార్మిక అంశాలతో పాటుగా, సాహిత్యోపన్యాసాలు కూడా చేస్తున్నారు.తిరుమల బ్రహ్మొత్సవాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలలో ఎన్నో పర్యాయాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
వీరు పొందిన సత్కారాల్లో సాహితీ విరించి బిరుదు, తెలుగు భాషా దినోత్సవ పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం, స్వరసుధ వారి సత్కారం, కళావాహిని వారి సత్కారం, స్వర రవళి వారి సత్కారం, శాంతిదూత పురస్కారం, శాతవాహన విశ్వ విద్యాలయం వారి పురస్కారం ప్రముఖమైనవి.

———–

You may also like...