| పేరు (ఆంగ్లం) | Ketavarapu Ramakotisastry |
| పేరు (తెలుగు) | కేతవరపు రామకోటిశాస్త్రి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | ఇందిరాదేవి |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | విశ్వనాథవైఖరి, సాహిత్యసంభావన, ఆధునిక తెలుగు సామాజికకవిత్వ ఉద్యమాలు, అభ్యుదయ వాద సాహిత్య విమర్శన దృక్పథం, కావ్యజిజ్ఞాస, మళ్లీ కన్యాశుల్కం గురించి, పోతన్నగారి వైచిత్రి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కేతవరపు రామకోటిశాస్త్రి |
| సంగ్రహ నమూనా రచన | – |
కేతవరపు రామకోటిశాస్త్రి
1931లో జన్మించాడు. వినుకొండ, గుంటూరులో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఆనర్స్ చేశాడు. 1954లో గుడివాడ కాలేజీలో లెక్చెరర్గా చేరి 3 సంవత్సరాలు పనిచేశాడు. అక్కడ త్రిపురనేని మధుసూధన రావు, చలసాని ప్రసాద్, శివసాగర్ మొదలైన వారు ఇతనికి శిష్యులుగా ఉన్నారు. 1959 ప్రాంతంలో హైదరాబాదు చేరి బిరుదురాజు రామరాజుపర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పము తత్త్వదర్శనము అనే అంశం మీద పి.హెచ్.డి చేశాడు. నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్లో తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా నియమించబడ్డాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతని పర్యవేక్షణలో కోవెల సంపత్కుమారాచార్యఆధునిక తెలుగుసాహిత్య విమర్శ – సంప్రదాయిక రీతి అనే అంశంపై, వరవరరావు తెలంగాణ విమోచన ఉద్యమం తెలుగునవల అనే అంశంపై పరిశోధనలు జరిపి పి.హెచ్.డి పట్టాలు పొందారు.
ఇతని భార్యపేరు ఇందిరాదేవి. ఇతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాత్యాయనీ విద్మహే, మైథిలీ ధీమహీ, శ్రీగౌరీ ప్రచోదయాత్ అని వారికి పేర్లుపెట్టడంలో ఇతని సాహిత్యాభిరుచి కనిపిస్తుంది. కాత్యాయనీ విద్మహే ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తోంది. 2013 సంవత్సరానికిగాను ఈమెకు కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.
———–