| పేరు (ఆంగ్లం) | Manikonda Satyanarayana Sastry |
| పేరు (తెలుగు) | మానికొండ సత్యనారాయణశాస్త్రి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/01/1895 |
| మరణం | 01/01/1985 |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా ఉరుటూరు గ్రామం |
| విద్యార్హతలు | బి.ఎల్. |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | బ్రిటిష్ మహాయుగము, లోకమాన్య బాలగంగాధర తిలక్ జీవితచరిత్ర, తూర్పు కృష్ణా జిల్లా జాతీయోద్యమ చరిత్ర, మానికొండ రామాయణము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మానికొండ సత్యనారాయణశాస్త్రి |
| సంగ్రహ నమూనా రచన | – |
మానికొండ సత్యనారాయణశాస్త్రి
మానికొండ సత్యనారాయణశాస్త్రి స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయనాయకులు, రచయిత మరియు పత్రికా సంపాదకులు.
వీరు కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా ఉరుటూరు గ్రామంలో 7 జూలై 1895 తేదీన లక్ష్మీనరసింహం దంపతులకు జన్మించారు.
వీరు సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి భారత స్వాతంత్ర్యపోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.
1939 లో న్యాయశాస్త్ర పరీక్షకు హాజరై బి.ఎల్. పట్టా పొందారు. అయినా ప్రజాసేవ లోనే జీవితాన్ని గడిపారు.
వీరు సత్యాగ్రహి, గ్రామ స్వరాజ్య వారపత్రికలను సంపాదకులుగా పనిచేసారు.
వీరు తెలుగులోను, ఆంగ్లంలోను ఎన్నో గ్రంథాలను రచించారు. ఆంగ్లంలో బసు పండితుడు రచించిన చారిత్రక గ్రంథాన్ని బ్రిటిష్ మహాయుగము అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
వీరు 90 ఏళ్ల వయసులో 1985 లో పరమపదించారు.
———–