| పేరు (ఆంగ్లం) | Dr. G V Purnachand |
| పేరు (తెలుగు) | డా. జి.వి. పూర్ణచందు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సత్యప్రసూన |
| తండ్రి పేరు | జి.వి.జి.కె. చంద్రమౌళీశ్వరరావు |
| జీవిత భాగస్వామి పేరు | అరుణాదేవి |
| పుట్టినతేదీ | 23/04/1957 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా కంకిపాడు |
| విద్యార్హతలు | డా॥నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో B.A.M.S. డిగ్రీ చదివారు. |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | విజయవాడ |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://drgvpurnachand.blogspot.com |
| స్వీయ రచనలు | డా. జి వి పూర్ణచందు వందకుపైగా పుస్తకాలు రాశారు. వీటిలో సుమారు నలభై పుస్తకాలు సామాన్యులకు వైద్య రహస్యాలను వివరిస్తాయి.,35 సంపాదకత్వం/సహసంపాదకత్వం వహించారు. తెలుగు భాషాసంస్కృతుల పరివ్యాప్తికి, మూలాలను త్రవ్వి తీసేందుకు దోహద పడే బృహద్గ్రంథాలుగా ఇవి,ప్రసిద్ధి పొందాయి.,• వైఙ్ఞానిక గ్రంథాలు – 6,• కవితాసంపుటాలు – 3,• నవలలు – 3,• విమర్శనా గ్రంథాలు – 14,• చరిత్ర గ్రంథాలు – 9,• జీవిత చరిత్ర గ్రంథాలు – 5,• వైద్యగ్రంథాలు – 23,• ఆహార చరిత్ర / వైద్య గ్రంథాలు – 11,• సామాజిక రచనలు – 11,• ఇతర భాషల్లోకి అనువాదం అయిన గ్రంథాలు – 4,• వివిధ పత్రికల్లో అనేక సంవత్సరాలపాటు కొనసాగిన శీర్షికలు వీరి కలం నుండి వెలువడ్డాయి.- 35,• ఆహార చరిత్ర గురించి మొత్తం 9 గ్రంథాలు వెలువరించగా, వాటిలోతరతరాల తెలుగు రుచులు పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది.,• తెలుగు విశ్వవిద్యాలయం వీరి “మన ఆహారం” ఆహారచరిత్ర గ్రంథాన్ని ప్రచురించింది. వీరి ‘ఆహారవేదం’ పరిశోధనా గ్రంథం అనేక పురస్కారాలను పొందింది.,• వీరి రచనలు `కాంతిస్వప్న` దీర్ఘకవిత, సప్తసింధు నవల, జీవిత చరిత్ర రచనల పైన ఎంఫిల్, వీరి సాహితీ జీవితం పైన పిహెచ్.డి పరిశోధనలు జరిగాయి. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | • 2000 గుర్రం జాషువా మిలీనియం విశిష్ట పురస్కారం, అంబేద్కర్ జాతీయ యువజన సమితి, విజయవాడ; • 2002 ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం – ‘భాషాభిజ్ఞ’ పురస్కారం, హైదరాబాదు; • 2005 నార్ల వెంకటేశ్వరరావు విశిష్ట సాహితీ సేవా పురస్కారం, హైదరాబాదు; • 2008 సర్వధారి నామ ఉగాది విశిష్ట పురస్కారం- శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక సాహితీసేవా సంస్థ విజయవాడ; • 2008 కీ.శే.నండూరి సారంగపాణి ఆచార్య స్మారక విశిష్ట సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం; • 2008 కాశీనాథుని నాగేశ్వరరావు ఫౌండేషన్-విశ్వదాత విశిష్ట సాహితీ పురస్కారం, యలకుర్రు; • 2008 డా. ద్వా. నా శాస్త్రి విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు; • 2008 కృష్ణా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వారి విశిష్ట సత్కారం, విజయవాడ; • 2008 యువభారతి, హైదరాబాదు సహృదయ అభినందన పురస్కారం, హైదరాబాదు; • 2008 ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ విశిష్ట సత్కారం, హైదరాబాదు; • 2008 ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి సత్కారం • 2009 ఆం. ప్ర. అధికార భాషా సంఘం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు; • 2009 ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్వర్ణోత్సవ సత్కారం; • 2009 కొనకళ్ళ వెంకటరత్నం శతజయంతి సాహితీ పురస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం; • 2009 నేషనల్ మెడికల్ అసోసియేషన్ విశిష్ట పురస్కారం; • 2009 కొమరగిరి వెంకట సత్యనారాయణ (బుచ్చినాయన) విశిష్ట సాహితీ పురస్కారం; • 2009 వైజ్`మెన్ ఇంటర్నేషనల్ ప్రతిభా పురస్కారం; • 2009 ఘంటసాల బౌద్ధ స్తూప ప్రారంభ సభలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సత్కారం • 2010 గిడుగు రామ్మూర్తి భాషోద్యమ శతజయంతి పురస్కారం, తెలుగురథం, హైదరాబాదు; • 2010 జ్యోత్స్న కళాపీఠం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు; • 2010 తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి కీర్తి పురస్కారం; • 2010 ఆరుద్ర సాహితీ ప్రతిభా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం, ఆం.ప్ర సాంస్కృతీ సమాఖ్య, విజయవాడ; • 2010 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ సత్కారం, విజయవాడ; • 2011 ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ శత జయంత్యుత్సవ సత్కారం; • 2012 కృష్ణాజిల్లా కలెక్టర్`చే కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి సత్కారం, మచిలీపట్టణం; • 2012 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం; • 2012 ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య సాహితీ సత్కారం, విజయవాడ; • 2012 ఆకాశవాణి విజయవాడ వారి స్వర్ణోత్సవ సత్కారం • 2012 లలితకళాసమితి మచిలీపట్టణం వారి సత్కారం • 2013 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు; • 2013 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కృష్ణా అర్బన్) సత్కారం, విజయవాడ; • 2013 రోటరీ క్లబ్ విజయవాడ వారి సాహితీ సత్కారం; • 2014 సరసభారతి, ఉయ్యూరు వారి ఉగాది పురస్కారం; • 2014 రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ వారి ప్రతిభా పురస్కారం; • 2014 ప్రపంచ తెలుగు సమాఖ్య సత్కారం, విజయవాడ; • 2014 ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల రాజమండ్రి వారి సాహితీ సత్కారం; • 2014 శ్రీకళాసుధ చెన్నై వారి జాతీయ పురస్కారం. • 2014 వేటూరి ప్రభాకరశాస్త్రి పీఠం, టి టి డి వారి సత్కారం, • 2016 ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారం • 2017 రాష్ట్రేతర తెలుగు సమాఖ్య బొంబాయి జీవనసాఫల్య పురస్కారం • 2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస (కళారత్న) పురస్కారం • 2018 పుట్టి వెంకటేశ్వర రావు “తెలుగు పసిడి” బిరుదు సత్కారం • 2018 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం వారిచే పుస్తకపఠన ప్రోత్సాహక పురస్కారం, • 2019 సద్గురు శివానంద సనాతనధర్మ చారిటబుల్ ట్రష్టు వారి శ్రీరామనవమి ప్రతిభాపురస్కారం • 2019 యర్రమిల్లి నరసింహారావు స్మారక విశిష్ట రచనా పురస్కారం. • 2019 పరవస్తు చిన్నయసూరి పీఠం వారి తెలుగు భాషాపురస్కారం • 2020 అజోవిభో వారి సత్కారం |
| ఇతర వివరాలు | • డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 120 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి • ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 20 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు • 1980 దశకంలో మినీ కవితా ఉద్యమ సారధుల్లో ఒకరు. తెలుగు భాషోద్యమ ప్రముఖులు. • కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచతెలుగు రచయితల సంఘం కార్యదర్శిగా తెలుగు భాషోద్యమాన్ని శక్తిమంతం చేయటానికి పరిశ్రమిస్తున్నారు. నాలుగు పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించారు, తెలుగు భాష విశిష్ట ప్రాచీనత జాతీయ సదస్సు, సింధు కృష్ణా లోయల నాగరికతల అధ్యయనం జాతీయ సదస్సు, కృష్ణాజిల్లా చారిత్రక వైభవం జాతీయ సదస్సు, న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు సదస్సు లాంటి అనేక జాతీయ సదస్సుల నిర్వహణలో వీరిది ప్రధాన పాత్ర. • తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి, కృష్ణాజిల్లా సర్వస్వం, కృష్ణాతీరం, దేశభాషలందు తెలుగు లెస్స లాంటి 20 బృహత్తర ఆకర గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. • కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం పోరాడిన వారిలో ఒకరు. • దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖలు వీరిని సత్కరించాయి. ఇంచుమించు 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. • వివిధ దిన, వార మాసపత్రికలలో రమారమి 35 శీర్షికలు నిర్వహించారు. ప్రస్తుతం 9 దిన వార మాసపత్రికలలో వీరి శీర్షికలు వెలువడుతున్నాయి. • తెలుగు భాష ప్రాచీనత నిరూపణకోసం తెలుగే ప్రాచీనం (ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రచురణ-2008) నైలూ నుండి కృష్ణ దాకా (ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురణ-2008), ‘తెలుగుకోసం’ (ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి సమితి ప్రచురణ), తెలుగులో అతిథిపదాలు (గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రష్టు ప్రచురణ.) లాంటి పరిశోధనాగ్రంథాలు వెలువరించారు. ఆం. ప్ర ఆర్కయివ్స్ వారి `ఇతిహాస్ జర్నల్`, వీరి భాషా చరిత్ర పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించింది. • లండన్ బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలలో తెలుగువారి ఆహారచరిత్ర పైన పరిశోధనాపత్ర సమర్పణ చేశారు.అక్కడి బ్రౌన్ సమాధి సందర్శించారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పచ్చళ్ళ ముచ్చట్లు – డా. జి వి పూర్ణచందు |
| సంగ్రహ నమూనా రచన | పచ్చళ్ళ ముచ్చట్లు – డా. జి వి పూర్ణచందు కూటికి లేని తనాన్ని చెప్పటానికి పచ్చడి మెతుకులే గతి అంటారు గానీ, నిజంగా పచ్చడి లేకపోతే కడుపు నిండినట్టు అనిపించదు. నిండదు కూడా! పచ్చడి, మన ప్రాచీన వంటకాలలో ఒకటి. రొట్టేలతో తినటానికైనా, అన్నంలో తినటానికయినా పచ్చడి అనుకూలంగా ఉంటుంది. కూరతో సమానమైన గుణ ధర్మాలన్నీ పచ్చడికీ ఉంటాయి. ఉత్తర భారతీయులు రోటి పచ్చడిని చట్నీ అనీ, ఊరగాయని అచార్ అనీ అంటారు, ‘అచి’, ‘అచ్చర”, ‘అచ్చడ్’ పదాలు పచ్చడి మన అనే పదానికి దగ్గరగా ఉన్నాయి. ఊరగాయల్ని కూడా ఊరగాయ పచ్చడి అనే పిలుస్తాం మనం. |
డా. జి.వి. పూర్ణచందు
పచ్చళ్ళ ముచ్చట్లు -డా. జి వి పూర్ణచందు
కూటికి లేని తనాన్ని చెప్పటానికి పచ్చడి మెతుకులే గతి అంటారు గానీ, నిజంగా పచ్చడి లేకపోతే కడుపు నిండినట్టు అనిపించదు. నిండదు కూడా!
పచ్చడి, మన ప్రాచీన వంటకాలలో ఒకటి. రొట్టేలతో తినటానికైనా, అన్నంలో తినటానికయినా పచ్చడి అనుకూలంగా ఉంటుంది. కూరతో సమానమైన గుణ ధర్మాలన్నీ పచ్చడికీ ఉంటాయి.
ఉత్తర భారతీయులు రోటి పచ్చడిని చట్నీ అనీ, ఊరగాయని అచార్ అనీ అంటారు, ‘అచి’, ‘అచ్చర”, ‘అచ్చడ్’ పదాలు పచ్చడి మన అనే పదానికి దగ్గరగా ఉన్నాయి. ఊరగాయల్ని కూడా ఊరగాయ పచ్చడి అనే పిలుస్తాం మనం.
ప్రాచీన అమెరికన్ రెడ్డిండియన్ భాషల్లో ఆక్సి, అహి, అచి పదాలు పచ్చడిని సూచించేవి ఉన్నాయి. అచి, అచ్చడ్, పచ్చడి, ఒకే మూలంలోంచి పుట్టిన పదాలు. అది మూలద్రావిడ పదం అయి ఉంటుంది. మిరప కాయల రాక తర్వాత తెలుగు పచ్చళ్ళ స్వరూపస్వభావాలు మారిపోయాయి. అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు.
తొక్కు: గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ నిలవ ఉండేలా తయారు చేసిన పచ్చళ్ళు. ఉప్పు కలిపి ఊరబెడతారు.
నంజు: నంజు, నంజుడు, నంజు పచ్చడి. పెరుగు అన్నంలో గోంగూర పచ్చడి నంజుడుకు గొప్ప ఉదాహరణ.
ఉపదంశం: సంస్కృతంలో పచ్చడిని ఉపదంశం అంటారు. పప్పుదినుసుల్ని గాని, కూరగాయల్ని గానీ మెత్తగా రుబ్బి, తయారుచేసే వ్యంజన విశేషం అని నిఘంటువు అర్థం దీనికి!
ఊర్పిండి: రుబ్బిన పప్పుధాన్య౦ పిండిని ఊరుపిండి. అట్లు, వడలు చేసుకోవటానికీ వడియాలు పెట్టుకోవ టానికి రుబ్బిన మినప పిండిని ఊరుపిండి అంటారు. అందులో అల్లం, పచ్చిమిర్చి కూడా కలిపి రుబ్బితే ‘ఊర్బిండి పచ్చడి’ అవుతుంది. అన్నంలో తింటారు దీన్ని.
ఊరు పచ్చడి: దీన్ని రోటి పచ్చడి అంటున్నాం. పప్పుదినుసులు, కూరగాయ ముక్కలు వేయించి, మిరపకాయలు కలిపి రుబ్బిన పచ్చడి ఊరుపచ్చడి.
బజ్జీ పచ్చడి: శ్రీనాథుడు బజ్జులు అనే వంటకం గురించి ప్రస్తావించాడు. ఏదైనా కూరగాయని నిప్పులమీద కాల్చి, రోట్లో వేసి రుబ్బి, పప్పుదినుసులతో తాలింపు పెట్టిన పచ్చడినే శ్రీనాథుడు ‘బజ్జు’ అన్నాడు. అంటే,బజ్జీ పచ్చడి!
ఊరగాయ పచ్చడి: కూరగాయని ముక్కలుగా తరిగి, ఉప్పు కలిపి ఉంచడాన్ని ఊరబెట్టడం అంటారు. నిమ్మ, టొమోటో లాంటి పళ్ళతో ఊరుపండునీ, మామిడి, చింతకాయలాంటి కాయలతో ఊరగాయనీ పెడుతున్నాం. కంద, పెండలంలాంటి దుంపలతో, గోంగూరలాంటి ఆకుకూరలతో కూడా ఊరగాయలు పెడుతున్నాం. మాంసంతో కూడా ఊరగాయ పెడతారు, దాన్ని ఊరుమాంసం అనాలి.
ఊరుపిండి పచ్చడి: నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని తెలికి పిండి అంటారు. దాన్ని నీళ్ళలో గాని, మజ్జిగలో గాని నాలుగైదు రోజులు నానబెడితే పులుస్తుంది. దానికి అల్లం, పచ్చిమిర్చి వగైరా చేర్చి మెత్తగా రుబ్బి, తాలింపు పెట్టిన పచ్చడిని కూడా “ఊరుపిండి పచ్చడి” అంటారు.
పచ్చడిని తినట౦ ఒక గొప్ప. దాన్ని తయారు చేసుకోవట౦లోనే ఆ గొప్పంతా ఉంది. మనవాళ్ళలో చింతపండు మీద వ్యామోహ౦ పెరిగి ఇటీవలి కాలంలో ప్రతిదానిలోనూ చింతపండు రసం పోయట౦ మొదలు పెట్టారు. అందువలన అదనంగా ఉప్పు, కారం కలప వలసి వస్తుంది.
పచ్చడి అనేది కడుపులో మంటని తెచ్చిపెట్టేదిగా మారిపోవటానికి అందులో అతి మషాలాలు, చింతపండు కలపటమే కారణం! వాస్తవానికి చింతపండుని కేవలం నాలుగురోజులపాటు నిలవ ఉంచుకొనే ఉద్దేశ్య౦తోనే పచ్చడిలో వేసి నూరతారు. కానీ, ఏ రోజుకారోజు సరిపడేదిగా పచ్చడి చేసుకుంటే చింత పండు అవసరం ఉండదు కదా! చింతపండు వేయనందువలన ఆ కూరగాయ అసలు రుచిని పొందగలుగుతా౦. అన్ని పచ్చళ్ళలోనూ ఎత్తుకెత్తు చింతపండు కలిపితే, ఏ పచ్చడయినా ఒకటే రుచిలో ఉంటుంది. ఆ భాగ్యానికి రుచి కోసం ఖరీదయిన కూరగాయలు కొనుక్కోవట౦ దేనికి చెప్పండీ?
ప్రతి వంటకంలోనూ, అల్లం,వెల్లుల్లి, మషాలాలు లేదా, చింతపండు రసం అతిగా కలిపే వాళ్ళు కూరగాయలలోని అసలు స్వారస్యాన్ని పొందలేని దురదృష్టవంతులే ననక తప్పదు.
రోటిపచ్చళ్ళను కూరగాయలతో మాత్రమే చేసుకుంటున్నాం. మాంసాహారమైతే, దాని నీచువాసన పోవటానికి అందులో వెల్లుల్లి లాంటి ఉగ్రగంథ ద్రవ్యాలను కలిపి వండవలసివస్తుంది. మరి కూరగాయలలో అలాంటి నీచువాసన ఉండదుకదా… వాటికి మషాలాలు కలపాల్సిన అవసరం అయితే లేదు. కలిపితే వాటి అసలు రుచిని మనం మూసేసినట్టే అవుతుంది. పచ్చడిని మషాలాలతోనూ, చింతపండుతోనూ కల్తీ చేయకుండా చెసుకుంటే ఆరోగ్యప్రదమైన రుచిని పొందగలుగుతా౦!
———–