| పేరు (ఆంగ్లం) | Iqbal Pasha |
| పేరు (తెలుగు) | ఇక్బల్ పాష |
| కలం పేరు | ఉజ్వల్ |
| తల్లిపేరు | ఖాజాబీ |
| తండ్రి పేరు | మహ్మద్ ఇబ్రహీం సాహెబ్ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | మహబూబ్ నగర్ జిల్లా , కొల్లాపూర్ |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ఉపాధ్యాయులు, కవి |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | గద్వాల |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 1977 లో తొలిసారి ‘దేవుడికో లేఖ’ పేరుతో దీర్ఘ కవిత రాశారు. 1984 లో గద్వాలలో జరిగిన విరసం రాష్ట్ర మహాసభలలో స్పందన పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. దీనిని అప్పటి విరసం సభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన సాగర్ గారు ఆవిష్కరించారు. వీరి ‘తుఫాను ‘ కవితకు రాష్ట్ర స్థాయి కవితల పోటిలో మొదటి బహుమతి వచ్చింది. ‘ జర్మినేషన్ ‘ పేరుతో వీరు రాసిన కవిత స్కైబాబ గారి సంపాదకత్వంలో వెలువడిన ‘ మునుమ ‘లోనూ చోటు దక్కించుకుంది. 1978 నుండి 2010 వరకు తాను రాసిన వాటిలో ఉత్తమమైన ఓ 88 కవితలతో సేద్యం[2] పేరుతో ఓ కవితా సంపుటిని 2011 లో వెలువరించారు. పాలమూరు అధ్యయన వేదికకు జిల్లా బాధ్యులుగా పనిచేస్తూ వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ వేదికలో పనిచేస్తున్న ఇతర కవులు పరిమళ్, ఉదయమిత్ర లతో కలిసి దుఃఖాగ్నుల తెలంగాణ [3] అను కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు ఉదయమిత్రతో కలిసి పాలమూరు జిల్లాలోని పోలేపల్లి సెజ్ ( ప్రత్యేక ఆర్థిక మండలి) సమస్యలపై రాసిన కొన్ని కథలు, కవితలతో కలిపి ఓడిపోలే…పల్లె [4] అను పుస్తకాన్ని వెలువరించారు. ఇంకా బాల గేయాలు, కరువు పాటలు, ఉపాధ్యాయ ఉద్యమ గీతాలు కూడా రాశారు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 1992లో ‘ఆటా’ వారు నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ ఎటు చూసినా వాడే ‘ కు ప్రత్యేక బహుమతి వచ్చింది |
| ఇతర వివరాలు | వీరు రంగస్థల నటులు కూడా. ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ శరబందరాజు గారి ఆధ్వర్యంలో వీరు ‘గరిబీ హటావో’ నాటకంలో మొదటి సారి నటించారు. విద్య, ఇంకా తెల్లారలే, కోడిపిల్లలొచ్చె, బాసగూడ మొదలగు వీధి నాటకాలలోనూ వీరు నటించారు |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | story not found |
| సంగ్రహ నమూనా రచన | – |
ఇక్బాల్ పాష
కథకుడిగా ఇక్బాల్
కళాశాలలో చదివే రోజుల నుంచే సాహిత్య రచనను మొదలు పెట్టారు. 1977 లో ‘ఎవరికి సొంతం వాడిన వసంతం’ పేరుతో మొదటి కథను రాశారు. 1992లో ‘ఆటా’ వారు నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ ఎటు చూసినా వాడే ‘ కు ప్రత్యేక బహుమతి వచ్చింది. అమెరికా నుండి వెలువడే ‘ అమెరికా భారతి ‘ లోనూ ఈ కథ అచ్చయింది. వీరి కథలన్నీ సామాజిక సమస్యల నేపథ్యంగా రాసినవే. గట్టు మండలంలో నెట్టెంపాడు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై రాసిన ‘ కాల్వ మింగిన ఊరు ‘, పోలేపల్లి సెజ్ సమస్యపై రాసిన ‘ కఫన్ ‘ కథలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1985 నుంచి వరుసగా రాస్తూ వచ్చిన కథలతో 2011 లో కఫన్ అను పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. విరసం వారి ‘కథల పంట’ లో, ప్రజా సాహితీ, అరుణతార పత్రికలో వీరి కథలు ముద్రించబడ్డాయి.
కవిగా ఇక్బాల్
1977 లో తొలిసారి ‘దేవుడికో లేఖ’ పేరుతో దీర్ఘ కవిత రాశారు. 1984 లో గద్వాలలో జరిగిన విరసం రాష్ట్ర మహాసభలలో స్పందన పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. దీనిని అప్పటి విరసం సభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన సాగర్ గారు ఆవిష్కరించారు. వీరి ‘తుఫాను ‘ కవితకు రాష్ట్ర స్థాయి కవితల పోటిలో మొదటి బహుమతి వచ్చింది. ‘ జర్మినేషన్ ‘ పేరుతో వీరు రాసిన కవిత స్కైబాబ గారి సంపాదకత్వంలో వెలువడిన ‘ మునుమ ‘లోనూ చోటు దక్కించుకుంది. 1978 నుండి 2010 వరకు తాను రాసిన వాటిలో ఉత్తమమైన ఓ 88 కవితలతో సేద్యం పేరుతో ఓ కవితా సంపుటిని 2011 లో వెలువరించారు. పాలమూరు అధ్యయన వేదికకు జిల్లా బాధ్యులుగా పనిచేస్తూ వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ వేదికలో పనిచేస్తున్న ఇతర కవులు పరిమళ్, ఉదయమిత్ర లతో కలిసి దుఃఖాగ్నుల తెలంగాణ అను కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు ఉదయమిత్రతో కలిసి పాలమూరు జిల్లాలోని పోలేపల్లి సెజ్ ( ప్రత్యేక ఆర్థిక మండలి) సమస్యలపై రాసిన కొన్ని కథలు, కవితలతో కలిపి ఓడిపోలే…పల్లె అను పుస్తకాన్ని వెలువరించారు. ఇంకా బాల గేయాలు, కరువు పాటలు, ఉపాధ్యాయ ఉద్యమ గీతాలు కూడా రాశారు.
నటుడిగా ఇక్బాల్]
వీరు రంగస్థల నటులు కూడా. ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ శరబందరాజు గారి ఆధ్వర్యంలో వీరు ‘గరిబీ హటావో’ నాటకంలో మొదటి సారి నటించారు. విద్య, ఇంకా తెల్లారలే, కోడిపిల్లలొచ్చె, బాసగూడ మొదలగు వీధి నాటకాలలోనూ వీరు నటించారు
———–