| పేరు (ఆంగ్లం) | Yelamancheli Venkatappaiah |
| పేరు (తెలుగు) | యలమంచిలి వెంకటప్పయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | ఆదెమ్మ |
| తండ్రి పేరు | అంకప్ప |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/30/1898 |
| మరణం | 03/01/1997 |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కులమేది? ఈ స్వరాజ్యంకోసమేనా జనం త్యాగాలు చేసింది? లగ్నాల పెళ్ళిళ్ళ బండారము మన నల్ల దొరల నలుబది నాలుగు ఏండ్ల పరిపాలన ఇదేనా? ఆడవాళ్ళను ఆదుకోరా? విగ్రహారాధన వేద విరుద్ధం కాదా? మొక్కల పెంపకం బీద ఓటర్లకు మేలుకొలుపు స్వతంత్ర భారత దేశంలో బీదల బ్రతుకులింతేనా? తిరుపతి వెంకన్న తిండి తినుట, రోగాలు పోగొట్టుట నిజమేనా? కన్యలు కరువైపొయ్యే కాలం కంపెట్తుకుని కూర్చున్నది |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | |
యలమంచిలి వెంకటప్పయ్య
నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద అక్షరాలు నేర్చుకోవడానికి పిడకల చచ్చికలు గల చిన్న తాటాకు బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.
నేను ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము.. చదివాను. అమర కోశము కంఠస్థ పరచాను. ఈ పుస్తకాలన్నీ నా 14 ఏండ్ల లోపలే చదివాను.
మాబడికి ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సెలవు లుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క కాని, విలువగల గారి నాణెమును పంతులకు ఇవ్వాలి.
ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచ్చి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.
ఆ రోజుల్లో తెల్ల దొరలు, తెల్ల దొరసానులు మాదిగ గూడాలలోనే తరచుగా వచ్చి తమ క్రీస్తు మత ప్రచారం చేసే వారు. అందువల్ల వారు మాట్లాడే భాషను మాల భాషగా, మాదిగ భాషగా ఎంచి దానిని ఏవ గించుకుని దాని జోలికి పోయే వారు కాదు.
ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా… వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా … బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన దానం చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల శక్తి గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట
23)
ఆ రోజులలో కల్లు, సారాయి, చుట్ట, బీడీలు త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్థులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడా బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడా గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వద్ద ఉచితంగా ఇంగ్లీషు నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పనిచేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా ఇంగ్లీషు మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
https://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B0%B2%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF
———–