పేరు (ఆంగ్లం) | B.V.V.Prasad |
పేరు (తెలుగు) | బి.వి.వి.ప్రసాద్ |
కలం పేరు | – |
తల్లిపేరు | విజయలక్ష్మి |
తండ్రి పేరు | అచ్యుతం |
జీవిత భాగస్వామి పేరు | మాలతి |
పుట్టినతేదీ | 21/11/1966 |
మరణం | – |
పుట్టిన ఊరు | సూర్యారావుపాలెం |
విద్యార్హతలు | బి.కాం. |
వృత్తి | వ్యాపారం |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆరాధన (వచన కవిత్వం) – 1989 దృశ్యాదృశ్యం (హైకూలు) – 1995 హైకూ (హైకూలు) – 1997 పూలురాలాయి (హైకూలు) – 1999 నేనే ఈ క్షణం (వచన కవిత్వం) – 2006 ఆకాశం (వచన కవిత్వం) – 2011 నీలో కొన్నిసార్లు (వచన కవిత్వం ) – 2015 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | – |
బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం
బి.వి.వి.ప్రసాద్ సాహిత్యం పట్ల ఆసక్తితో పలు కవిత్వ రచనలు చేశారు. స్కూలు చదువులో చిత్రకళతో ప్రారంభమైన సృజనాత్మక వ్యాసంగం, కళాశాల చదువుకు వచ్చేసరికి కవిత్వంగా మారింది. 1989లో తొలి పుస్తకం “ఆరాధన” (కవిత్వ సంకలనం) ప్రచురించేనాటికి కవిత్వం, కథలు, సాహిత్య తత్త్వచింతనలు రాసుకున్నారు. హైకూ ప్రక్రియలో రాసుకున్న కవితలతో 1995, 1997, 1999ల్లో వరుసగా దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి సంపుటాలు ప్రచురించారు. వీరి వచన కవిత్వం 2006లో “నేనే ఈ క్షణం” 2011లో “ఆకాశం” 2015లో “నీలో కొన్నిసార్లు” పేర్లతో సంపుటాలుగా వచ్చింది. 2015లో హైకూలు, హైకూపై వ్యాసాలూ కలిపి “బివివి ప్రసాద్ హైకూలు”గా వచ్చింది.
———–