పేరు (ఆంగ్లం) | Karanam Balasubrahmanyam Pille |
పేరు (తెలుగు) | కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె |
కలం పేరు | – |
తల్లిపేరు | కృష్ణమ్మ |
తండ్రి పేరు | కుమారస్వామి పిళ్ళె |
జీవిత భాగస్వామి పేరు | హేమావతి |
పుట్టినతేదీ | 02/01/1936 |
మరణం | 1/11/2016 |
పుట్టిన ఊరు | చిత్తూరు జిల్లా తలుపులపల్లెగ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలుగు పండితులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పద్యకావ్యాలు విషాద మాధవి చరిత్రకెక్కిన మారణహోమం ఒక రాఘవరెడ్డి కథ ఓరుగల్లు – వీరగల్లు నాటకాలు దివిలో కవిసమ్మేళనం అన్వేషణ – అంభి కథలు ఆ నవ్వే జింకపిల్ల గుండె ఊసులాడింది నవలలు చండాలుడు మర్రిమాను సాక్షిగా బోయకొట్టములు పండ్రెండు వ్యాస సంపుటులు ఈ పద్యం నేర్చుకుందామా! వెలుగు తగ్గిన తెలుగు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 9వ ఆటా మహాసభల కథల పోటీలో రూ. 7000 పారితోషికం అందుకున్న కథకు రచయిత 9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీలో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం రచయిత |
ఇతర వివరాలు | భాషాప్రవీణ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె (ఫిబ్రవరి 1, 1936 – జనవరి 11, 2016) ప్రముఖ రచయిత, తెలుగు పండితులు.వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. ఆయన తెలుగు పద్యకావ్యం “విషాద మాథవి”కి ముందుమాట రాసిన పల్లంపాటి వెంకటసుబ్బయ్య “పద్య విద్య తెలిసిన కవి” అని ప్రశంసించాఅరు. తరువాతి పద్యకావ్యం “చరిత్రకెక్కిన మారణహోమం” అత్యాధునిక స్త్రీవాద భావాలతో కూడిన ఈ రెండు గ్రంథాలకూ మూల కథలు మహాభారతంలోనివి. మరో పద్యకావ్యం “ఒక రాఘవరెడ్డికథ” మావోయిస్టులకూ, పోలీసులకూ మధ్యన నలిగిపోయే అటవీ ప్రాంతాల ప్రజల దీనగాథ. దీనినే “మర్రిమాను సాక్షిగా” పేరిత సాంఘిక నవలా రూపంలో వెలువరించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బోయకొట్టములు పన్నెండు |
సంగ్రహ నమూనా రచన | నల్లమల ప్రాంతం నుండి బోయలు అద్దంకి ప్రాంతానికి వలసపోవడంతో ప్రారంభమైన ఈ నవల 200 సంవత్సాల తరువాత పండరంగడనే సేనాధిపతి చాళుక్య సైన్యంతో పండ్రెండు బోయకొట్టాల మీద దాడి చేసి కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేయడంతో ముగుస్తుంది. బోయల మొదటి రాజు వీరనబోయడు. అతని తర్వాత అతనికి నలుగురు వారసులు. రెండో వీరనబోయడు, పులిరాజు బోయడు, కసవన బోయడు, నన్నిదొరబోయడు, పొన్నిదొర బోయడు మొదలైన బోయరాజులు పరిపాలన చెయ్యడం – బోయల ఆచార వ్యవహారాలు, అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకోవడం మొదలైన సన్నివేశాలను రచయిత ఈ నవలలో చిత్రించాడు. |
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
బోయకొట్టములు పన్నెండు
నల్లమల ప్రాంతం నుండి బోయలు అద్దంకి ప్రాంతానికి వలసపోవడంతో ప్రారంభమైన ఈ నవల 200 సంవత్సాల తరువాత పండరంగడనే సేనాధిపతి చాళుక్య సైన్యంతో పండ్రెండు బోయకొట్టాల మీద దాడి చేసి కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేయడంతో ముగుస్తుంది. బోయల మొదటి రాజు వీరనబోయడు. అతని తర్వాత అతనికి నలుగురు వారసులు. రెండో వీరనబోయడు, పులిరాజు బోయడు, కసవన బోయడు, నన్నిదొరబోయడు, పొన్నిదొర బోయడు మొదలైన బోయరాజులు పరిపాలన చెయ్యడం – బోయల ఆచార వ్యవహారాలు, అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే పోట్లాడుకోవడం మొదలైన సన్నివేశాలను రచయిత ఈ నవలలో చిత్రించాడు. బోయరాజులతోపాటు ఆ రోజుల్లో తెలుగు దేశాన్ని పాలిస్తున్న వేంగిచాళుక్యరాజులు తెలుగుభాషాభివృద్ధికి చేసిన సేవలను ఈ నవలలో మనం చదువుతాం. మరోవైపు పల్లవుల రాజ్యం, పల్లవరాజులకు బోయలకు ఉన్న మంచి సంబంధలూ, పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య ఉన్న వైరం, ఈ ఇరు వంశాల్లోని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలన్న ఆకాంక్ష కారణంగా జరిగిన యుద్ధాలు, ఈ ఇరువురి మధ్య నలిగిన బోయప్రజలు – ఇలా ఈ నవలలో ఆనాటి అనేక పరిస్థితుల చిత్రణ ఉంది.
పండరంగడు వేయించిన అద్దంకి శాసనం ఆధారంగా ఇంత పెద్ద చారిత్రక నవలను రచించడం చాల కష్టసాధ్యమైన విషయం. చరిత్రలో సాధారణంగా గెలిచిన వారి ప్రస్తావనే ఉంటుంది. పండ్రెండు బోయకొట్టాలను ధ్వంసం చేశానని పండరంగడు గర్వంగా చెప్పుకుంటూ ఈ అద్దంకి శాసనాన్ని వేయించాడు. ఆ పండ్రెండు బోయకొట్టాల్ని నిర్మించుకొన్న బోయలెవ్వరు? వాళ్ళు ఎక్కడి నుండి అక్కడికొచ్చారు? వాళ్ళెలా జీవించారు? వాళ్లనుపాలించిన రాజులెవరు? వాళ్ళ ఆచార వ్యవహారాలేమిటి? పల్లవులకు చాళుక్యులకూ మధ్య యుద్దాలెందుకు జరిగాయి? ఆనాటి తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఎలా అభివృద్ధి చెందాయి? దేశ కవిత్వాన్ని చాళుక్య రాజులెలా పోషించారు? మొదలైన అనేక ఆసక్తికరమైన అంశాలను గూర్చి ఆలోచించి, ఊహించి, పరిశోధించి ఒక సంవత్సర కాలం శ్రమించి కారణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ నవలను రచించారు.
ఈ నవలను పాఠకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
———–