Share
పేరు (ఆంగ్లం)Durganand
పేరు (తెలుగు)దుర్గానంద్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/12/1927
మరణం5/7/1985
పుట్టిన ఊరుతెనాలి దగ్గర మోదుకూరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంతర్గోళాలు (కవితా సంపుటి)
‘మధూలిక’
జూనా ప్రణయగాథ (పద్యం)
రంగపతి (నవల)
గీతాంజలి (స్వేచ్ఛానువాదం)
సూరదాసుపదాలు
ఫిరదౌసీ (హిందీ భాషలోకి తర్జుమా)
ఘెరావ్ కవితలు,
సృజన కర్త శంఖారావం, [5]
డ్రీమ్స్ కాలనీ (ఇంగ్లీషు),
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుదుర్గానంద్ అవిశ్రాంతంగా సాహితీ సృజన చేసి ఆనాటి విమర్శకుల దృష్టి నాకర్షించి కొత్త ఆలోచనలు రేకెత్తించిన వినూత్న భావకవి
స్ఫూర్తిదుర్గానంద్ అవిశ్రాంతంగా సాహితీ సృజన చేసి ఆనాటి విమర్శకుల దృష్టి నాకర్షించి కొత్త ఆలోచనలు రేకెత్తించిన వినూత్న భావకవి
నమూనా రచన శీర్షికదుర్గానంద్
సంగ్రహ నమూనా రచన

దుర్గానంద్

కవిగా

ఈయన కాలంతో కదిలే చేవగల కవి గనుక శాస్త్రీయ పదాల మూలాల్లోంచి కవిత్వాన్ని ధ్వనింపచేసిన కవిగా కావ్య పరిధుల్ని పెంచాడు. ఈయన్ని గూర్చి జాషువా “దుర్గానంద్ శాస్తవ్రాదాన్ని ఊతగాగొని కావ్య పరిధుల్ని పెంచుతున్నాడు, కొత్తదారులు వేసుకుంటున్నాడు.ఊర్ధ్వగామి. కొత్త కఱ్ఱులు చాస్తున్న స్వభావం. తాను వేసే ప్రతి అడుగులోను కొత్త చప్పుడు నింపుతున్నాడు” అంటూ కొనియాడారు. ఈయన కవిత్వం వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్నప్పటికీ మార్క్సిజానికి అతీతమైన తనదైన ‘సృజనకర్తల రాజ్యం’ అనే ప్రతిపాదన సాహిత్య పరిధిలోకి తెచ్చాడు. శ్రమజీవుల రాజ్యం అనే పదబంధానికి బదులు ‘సృజన కర్తల రాజ్యం’ అనే పదబంధాన్ని ప్రవేశపెట్టారు. నాణానికి, ధనానికి మధ్య ఉన్న అంతరువును తెలియజేస్తూ సాలుసరిగా కరెన్సీ రద్దు విధానం ప్రవేశపెట్టినట్టయితే వస్తుమార్పిడికి టోకెనుగా నాణాన్ని మార్చినట్లయితే, ధనాన్ని అక్రమంగా సంపాదించి స్వదేశాల్లోనో, విదేశాల్లోనో నిల్వపెట్టుకునే పద్ధతి నశిస్తుందని భావించాడు. దీనినే ఆయన కమ్యూనిజంలో వ్యక్తి స్వేచ్ఛ అన్నారు. లేదా స్వేచ్ఛాయుత కమ్యూనిజం అన్నారు. లేదా సాఫ్ట్ కమ్యూనిజం అన్నారు. ఈ ప్రపంచమంతా ప్రవాహమయం అంటూ ‘జీవితం మరణంలోకి ప్రవహిస్తుంది, పురుషుడు స్ర్తిలోకి ప్రవహిస్తున్నాడు, ప్రతీదీ ప్రవహించుకుంటూ పోతుంది అనేది వీరి భావన. స్ర్తితత్వం మహోన్నమైనదిగాను, పురుషుడి చివరిదశ స్ర్తితత్వంలోకి మారిపోవడమేనంటారు. కర్కశత్వం పురుషుని తత్వమని, మృదుల స్వభావం స్ర్తి తత్వమని నిర్ధారిస్తూ వారు వీరు వీరు వారుగా కాలప్రవాహంలో మారుతూ వారి తత్వ బేధాలను వ్యక్తీకరిస్తుంటారనేది వీరి వాదం. పద్యం, గేయం వచన కవిత్వం, సాహిత్య రూపాలన్నింటిలోను వీరిదంటూ ఓ ముద్ర వేసుకోగలిగారు.

1960నాటి తొలి రోజుల్లో దుర్గానంద్‌ తెలుగు చేసిన గీతాంజలి లో ‘మొగలాయిల బహిఃప్రాణ సౌందర్యాన్ని చూపించింది తాజ్‌మహల్‌ అయితే హిందువుల అంతఃస్సౌందర్యాన్ని చూపించింది గీతాంజలి. గీతాంజలిని అనువదించి నా శిల్పాన్ని సంస్కృతీకరించుకున్నాను’ అని చెప్పుకున్నారు దుర్గానంద్‌.[4]

రచనల

ముద్రిత కావ్యాలు

  • అంతర్గోళాలు (కవితా సంపుటి)
  • ‘మధూలిక’
  • జూనా ప్రణయగాథ (పద్యం)
  • రంగపతి (నవల)
  • గీతాంజలి (స్వేచ్ఛానువాదం)
  • సూరదాసుపదాలు
  • ఫిరదౌసీ (హిందీ భాషలోకి తర్జుమా)
  • ఘెరావ్ కవితలు,
  • సృజన కర్త శంఖారావం, 
  • డ్రీమ్స్ కాలనీ (ఇంగ్లీషు),

అముద్రితాలు ఎనిమిది నవలలు ఖండకావ్యాలు ఉన్నాయి. దుర్గానంద్ కళాపీఠ వారు కొన్నింటిని ప్రస్తుతం వెలుగులోకి తెస్తున్నారు.

———–

You may also like...