| పేరు (ఆంగ్లం) | Vasireddy Sitadevi |
| పేరు (తెలుగు) | వాసిరెడ్డి సీతాదేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వాసిరెడ్డి రంగనాయకమ్మ |
| తండ్రి పేరు | వాసిరెడ్డి రాఘవయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/15/1933 |
| మరణం | 04/13/2007 |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | జీవితం అంటే (1950), మరీచిక (1982), విషకన్య, తిరస్కృతి, రాక్షస నీడ, వైతరణి, మరో సావిత్రి కథ (యథార్థగాథలు) (1983) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రపెర్ల్బక్ |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వాసిరెడ్డి సీతాదేవి |
| సంగ్రహ నమూనా రచన | – |
వాసిరెడ్డి సీతాదేవి
వాసిరెడ్డి సీతాదేవి ప్రసిద్ధ తెలుగు నవలా మరియు కథా రచయిత్రి..
ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య మరియు రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నై చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. మరియు ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950) మరియు తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు మరియు 100 పైగా కథలు రచించారు.
ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె 1985 – 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.
ఈమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు 1998 సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు.
———–