| పేరు (ఆంగ్లం) | B.V.S. Ramarao |
| పేరు (తెలుగు) | బి.వి.ఎస్.రామారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సత్యవతి |
| తండ్రి పేరు | భావరాజు సత్యనారాయణ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | అది వాడు చేప, అద్దరి ఇద్దరి, ఆఫీసులో ఆవకాయ గొంతులో వెలక్కాయ, ఇదం బ్రహ్మం, ఎసరు అత్తెసరు, గంగి, గుండెల్లో గోదారి, తిప్పలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బి.వి.ఎస్.రామారావు |
| సంగ్రహ నమూనా రచన | – |
బి.వి.ఎస్.రామారావు
బి.వి.ఎస్.రామారావు ప్రముఖ కథారచయిత. గోదావరి కథల ద్వారా ప్రసిద్ధుడయ్యాడు.
భావరాజు వెంకట సీతారామారావు రాజమండ్రిలో 1932లో జన్మించాడు. భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత బి.వి.రమణారావు, ప్రముఖ ఇంద్రజాలికుడు బి.వి.పట్టాభిరామ్, ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. మద్రాసులోని కేసరి స్కూలులో చదువుకునే సమయంలో ఇతనికి ముళ్ళపూడి వెంకటరమణ, బాపులతో స్నేహం ఏర్పడి అది చివరిదాకా కొనసాగింది.
ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా ఉద్యోగంలోనికి చేరాడు. గోదావరి ప్రాజెక్టులో 15 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర హోదాలలో పనిచేశాడు. ఆ సమయంలో ఆనకట్టల రిపేర్లు, కొత్త ఆనకట్టల నిర్మాణం, బ్యారేజీ నిర్మాణం, హైడ్రాలిక్ గేట్ల నిర్మాణం వంటి పనులలో భాగస్వామ్యం వహించాడు. అనేక వర్క్షాపులను నిర్వహించాడు. తర్వాత హైదరాబాదుకు బదిలీ అయ్యి 4 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశాడు. పిమ్మట ఒక ప్రయివేటు సంస్థలో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇతనికి భార్య అన్నపూర్ణ, ఇద్దరు కుమార్తెలు సత్యకళ, విజయ ఉన్నారు. కుమార్తెలు ఇరువురూ వివాహం చేసుకుని హైదరాబాదులోనే స్థిరపడ్డారు.
ఇతడు తన బాల్య స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ, ఆంధ్రజ్యోతి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మల ప్రోద్బలంతో కథలు వ్రాయడం మొదలుపెట్టాడు. సంఖ్యాపరంగా తక్కువ కథలు వ్రాసినా అవి అన్నీ పాఠకుల మన్ననలను చూరగొన్నాయి. గోదావరీనది పరిసర ప్రాంతాలలో పనిచేసినప్పుడు అక్కడి మనుషులు, మనస్తత్వాలను గమనించి “గోదావరి కథలు” వ్రాశాడు. ఈ కథలలోని ఒక కథ ఆధారంగా మంచు లక్ష్మి గుండెల్లో గోదారి అనే సినిమాను నిర్మించింది.
———–